ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏపీలో జగనన్న విద్యా దీవెన ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 19, 2021, 10:43 AM

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది. గురించి మూడు నెలలకు ఒకసారి సొమ్మును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నేడు 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671. 45 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com