భారత్, చైనా దేశాల మధ్య ఉధ్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు దాదాపు రెండు కిలో మీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు సమాచారం. అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా చైనా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని సమాచారం. అయితే బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్ 15న దాడికి తెగబడింది. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.