కరోనా నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తలు తీసుకోడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అది తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. కరోనా విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పక పాటించాలన్నారు. బల్గేరియా ప్రధాని బొరిస్సోవ్ మాస్క్ పెట్టుకోలేదని 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. గ్రామీణుడికైనా, దేశ ప్రధానికైనా నిబంధనలు ఒకేలా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్లాక్ 2 మొదలవుతుందని, కాబట్టి భారతీయులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు.