ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 05:38 PM

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం తథ్యం అని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం స్పష్టం చేశారు. పిఠాపురంలో వైసీపీ నేతలు ఎన్ని కబుర్లు చెప్పిన జనాలు వినిపించుకోరని తెలిపారు. సీఎం జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదన్నారు. పిఠాపురం ప్రజలు డబ్బులు తీసుకోరని ఆయన వివరించారు. పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమను జగన్ సర్కార్ వేధింపులకు గురిచేసిందని వివరించారు. గత ఐదేళ్లలో ఇండస్ట్రీ పెద్దలు పడిన ఇబ్బందుల గురించి పూసగుచ్చినట్టు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com