కేశినేని చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ.. నేడు ముదిరాజ్ వర్గం చాలా వెనుకపడి ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వం లో వారికి కనీస ప్రోత్సాహం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అని అంటే నమ్మి ఓటు వేశారన్నారు. ఇప్పుడు తప్పు తెలుసుకుని టీడీపీలోకి చేరడం సంతోషమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సారధ్యంలో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కేశినేని చిన్ని అన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని... మీకు మేలు చేసిన పార్టీ అని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే బీసీలు ఆర్ధికంగా ఎదిగారన్నారు. ఓటు ప్రాధాన్యతను అందరికీ చెప్పాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండని సూచించారు. పది మందికి చెప్పి.. కూటమి పార్టీలకు ఓటు వేయించాలని కేశినేని చిన్ని తెలిపారు. మీకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.