ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతుందన్న వార్తలు రాజకీయంగా హల్ చల్ చేస్తున్నాయి. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం దూరంగా ఉందని అందువల్ల తమ ప్రాంతాన్నే ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ తెరపైకి వస్తోంది. కొత్త జిల్లాల ప్రతిపాదనను ఆసరాగా తీసుకుని పలు ప్రాంతాల్లో ఉద్యమ కార్యచరణ ప్రారంభమైంది. తాజాగా కర్నూలు జిల్లాలో కూడా ఈ వాదన బలంగా వినిపిస్తోంది.ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ వాదనలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆదోని డివిజన్ గా ఉన్న నేపథ్యంలో దాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రమే ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం లేదని డివిజన్ ను జిల్లాగా ప్రకటిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డివిజన్ ను జిల్లాగా ప్రకటిస్తే పరిపానకు అనుకూలంగా భవనాలు ఉంటాయని దాని వల్ల ఇబ్బందులు తలెత్తవన్నారు.ఆదోని డివిజన్లో ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు ఉన్నాయని ఈ అన్ని నియోజకవర్గాలను కలుపుకుని ఒక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి అవసరానికి కర్నూలుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదోని ప్రజలు వాపోతున్నారు. ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆదోని డివిజన్ ప్రాంత ప్రజలు తమ సమస్యలు ఉన్నతాధికారులకు చెప్పుకోవా లంటే కర్నూలుకు వెళ్లడం చాలా దూరమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఏ చిన్నపాటి ఆరో గ్య సమస్య తలెత్తినా కర్నూలుకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. జిల్లాల ఏర్పాటు రాజకీయాల కోసం కాకూడదని, ప్రజల అవసరాలు తీర్చేవిధంగా ఉండాలని అని ఆదోని ప్రజలు కోరుకుంటున్నారు. ఆదోనిని జిల్లా కోసం త్వరలోనే ఉద్యకార్యచరణ ప్రకటిస్తామని పలువురు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకుని టీడీపీ మంత్రాలయ ఇన్ చార్జ్ తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అన్నిపార్టీల మద్దతుతో ఉద్యమాలు చేపడతామని కూడా హెచ్చరించారు.1867లో ఆదోని మున్సిపాలిటీగా ఏర్పడిందని 152 ఏళ్ల చరిత్ర ఉందని ప్రజలు చెప్తున్నారు. అయినప్పటికీ ఆదోని వెనుకబడే ఉందని వాపోతున్నారు. ఆదోని జిల్లాగా ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తాయని ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టించుకునే నాదుడే కరువవుతాడని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఆదోని డివిజన్ ను పట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆదోని మున్సిపాలిటీగా ఏర్పడి 152 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్తున్నారు. ఆదోని డివిజన్ గా ఏర్పడి కూడా చాలా కాలం అయ్యిందన్నారు. అయితే ఇప్పటికీ డిగ్రీ కళాశాల లేదని అలాగే డ్రైనేజీ వ్యవస్థ గానీ...బైపాస్ రోడ్లు గానీ లేవని వాపోయారు. ఇప్పటికీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తేనే గానీ అభివృద్ధికి నోచుకోదని ప్రజలు వాపోతున్నారు. మరి ఆదోని ప్రజల డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.