ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని అందుకోసం అడ్డదారులను వెతుకుతు.. చివరికి తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వాపోయారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని, అలాగే దొంగ ఓట్లు వేయొద్దని సూచించారు. దొంగ ఓట్లు వేస్తే నేరం చేసినట్టు అవుతుందని, జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు.