విజయనగరం జిల్లా, జామి మండల కేం ద్రమైన జామిలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకు డు, విశాఖ ఎంపీ అభ్య ర్థిగా పోటీచేస్తున్న కేఏ పాల్ సందడి చేశారు. బుధవారం జామి బజారు సెంటర్కు కారులో వచ్చిన కేఏపాల్ కారు పైకెక్కి ఒక మట్టి కుం డను చూపిస్తూ కుండ గుర్తుపై ఓటువేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్, సైకిల్, కమలం గుర్తులపై కాకుండా కుండ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తనను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తానని తెలిపారు.