స్పెషల్ ఎనఫోర్స్మెంట్ బ్యూరో రాయలసీమ జోన డిప్యూటీ కమిషనర్ టి.విజయ శేఖర్ బుధవారం పీలేరు ఎస్ఈబీ స్టేషనను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషనలోని రికార్డులు పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నివారణ, మోడల్ కోడ్ ఆఫ్ కాం డాక్ట్ అమలు, పాటించాల్సిన నిబంధనల గురించి సిబ్బందికి వివరించారు. అనంతరం చిత్తూరు మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సందర్శించి అక్కడ జరుగుతున్న వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ సీఐ శ్యాంప్రసాద్, ఎస్ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది యోగానంద, గిరిబాబు, సుధాకర, సురేశ, రమేశ, జయభాను, గంగా మహేశ్వరి, పాల్గొన్నారు.