ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేస్తున్నారు.. మరొకరితో శారీరక సుఖాలకు మరిగి... ప్లాన్ చేసి మరి.. భర్తను కాటికి పంపిస్తున్నారు.. ఇలాంటి కేసులు వరుసగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.. తన బంధానికి అడ్డుగా ఉన్నాడనే ఈ మధ్యే మేడ్చల్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసు మరువక ముందే.. ఇలాంటి తరహా కేసే ఏపీలో వెలుగు చూసింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిన కిరాతకురాలిని అనంతపురం జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లిలో వెంకటేషు, అరుణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.. అయితే, అరుణకు అదే గ్రామానికి చెందిన కేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అదికాస్త అక్రమసంబంధానికి దారితీసింది.. ఈ విషయం భర్తకు తెలియడంతో.. వారి కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి.. పద్దతి మార్చుకోమని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా..
తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తూనే ఉంది అరుణ.. గొడవలు రోజురోజుకి పెరిగిపోతుండడంతో.. ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.. ఈ నెల 26వ తేదీన అర్ధరాత్రి భర్త గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత కొడవలితో దాడిచేసి చంపేసిన భార్య..అనావాళ్లు కనబడకుండా చేసి.. అక్కడి నుంచి ప్రియుడి దగ్గరకు వెళ్లి.. రాసలీలల్లో మునిగిపోయింది. ఇక, మరునాడు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియనట్టుగా.. ఇంటికి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి విలపించసాగింది.. తన భర్తను ఎవరో హత్య చేశారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అరుణ ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి అన్న.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అరుణను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తానే హత్య చేశానని.. తన ప్రియుడు ఈ హత్యకు సహకరించాడని పోలీసులకు వెల్లడించింది.