ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 కుంభకోణంపై శ్వేత పత్రం విడుదల చేయాలి: టీడీపీ నేత వర్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 01, 2020, 12:34 PM

108 కుంభకోణంపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 108 వాహనాల కొనుగోలులో 307 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వాటిని జెండా ఊపి ఎలా ప్రారంభిస్తారని జగన్​ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షం ఆరోపణలు చేసిన వెంటనే విచారణకు అదేశించాల్సింది పోయి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.అనుభవం లేని అరబిందో సంస్థకి 108 నిర్వహణ బాధ్యతలు ఎలా ఇస్తారని మండిపడ్డారు. రాష్ట్రం ఏమైనా జగన్, విజయ సాయిరెడ్డిలకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని ప్రశ్నించారు. అంబులెన్స్​లు కొన్నది ప్రజల ఆరోగ్యం కోసం కాదని.. అరబిందో సంస్థకు డబ్బు అందించేందుకని వర్ల ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు వ్యవహరిస్తున్నారని విమర్శించారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com