ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 05:07 PM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండలంలోని బాపురం ఎల్లెల్సీ కాలువ వద్ద శనివారం హాలహర్వి ఎస్సై బాల నరసింహులు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి దాడులు జరిపి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బాల నరసింహులు తెలిపిన మేరకు.. బాపురం ఎల్లెన్సీ కాలువ వద్ద వాహనాల తనిఖీ చేపట్టి కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి మధనగోపాల్, తాయప్ప, నాగరాజు, చంద్రశేఖర్ బైక్ పై 534 కర్ణాటక మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com