భారత్ లో గత 24 గంటల్లో 16,922 కరోనా కేసులు నమోదవ్వగా 418 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 2,71,697 మంది కోలుకోగా 14,894 మంది మరణించారు. ప్రస్తుతం 1,86,514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఒక్క రోజులో అత్యధికంగా కరోనా కొత్తకేసులు నమోదయ్యాయి.