మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే ఎస్బీఐ మీకోసం ఒక ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. రూ.30,000 వరకు డిస్కౌంట్ తో టాటా టియాగో కారును కొని కళ్లుచెదిరే డిస్కౌంట్ పొందండి అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారికి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారు బుక్ చేసుకుంటే ఏకంగా రూ.30,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా యోనో ద్వారా కారు కొనుగోలు చేస్తే ఇంకా రూ.3,000 విలువైన యాక్ససిరీస్ను ఉచితంగా ఇవ్వనుంది.ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కారు కొనుగోలుకు ఎస్బీఐ లోన్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కార్ లోన్ కోసం అప్లై చేసుకుంటే 7.75 శాతం వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. జూన్ 30 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇకపోతే కారు సేల్, సర్వీస్కు సంబంధించి బ్యాంక్కు ఎలాంటి సంబంధం ఉండదని కూడా వెల్లడించింది.