శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో ఉంచిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.52,000 కాగా.. రూ.30,001 తగ్గించారు. దీంతో ఈ మొబైల్ ఇప్పుడు రూ.21,999కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్స్ డే నిర్వహిస్తున్నారు. ఈ ధర తగ్గింపు ఆ ప్రత్యేక ఆఫర్లలో భాగమా? లేక ఇకపై ఇదే ధరలో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఫోన్ ప్రత్యేకతలు..అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఈ ఫోన్ లో ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్ గా ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. వెనకవైపు కెమెరాలో ఆటోఫోకస్ ఫీచర్ ను కూడా అందించారు.
128 జీబీ స్టోరేజ్..
ఇందులో 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉండేలా డిజైన్ చేశారు. రెండు నానోసిమ్ లను వాడొచ్చు. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఈ మొబైల్ సపోర్ట్ చేయనుంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను అందించారు. ఫేస్ అన్ లాక్ ఫీచర్ సైతం ఈ మొబైల్ లో ఉంది.