ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉన్నతాధికారి శారీరక సుఖం కోసం దిగజారాడు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి పని కోసం తన దగ్గరకు వచ్చిన ఓ మహిళను నమ్మించి మోసం చేశాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నానని.. నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. రెండేళ్లపాటు ఆమెతో శారీరక సుఖం అనుభవించాడు. అయితే బాధిత మహిళ అనుమానం వచ్చి ఆరాతీయగా ఆ అధికారి భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించింది. ఇదేంటని ఆ అధికారిని ఫోన్ లో నిలదీస్తే విడాకుల ప్రక్రియ జరుగుతోందంటూ మరో సారి మాయమాటలు చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. బాధితురాలు నేరుగా ఆఫీసుకు వెళ్లగా బేరసారాలకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ అధికారిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ ఐఆర్ఎస్ అధికారి ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్ లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతను డిప్యూటీ కమిషనర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఖర్గర్లో నివాసముంటున్నట్లుగా బాధితురాలు తెలిపింది.