గాల్వాన్ లోయలో ఘర్షణపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. గాల్వన్ లోయ పై పూర్తి అధికారం మాదే అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు ఒప్పందాలను భారత సైన్యం ఉల్లంఘించింది అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నామని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
ఘర్షణ ఘటన చైనా భూభాగంలోనే జరిగింది. చర్చల ద్వారానే సమస్య పరిస్కారమని మేము నమ్ముతున్నాం. చైనా- ఇండియా మధ్య మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.