తమిళనాడు కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనా సోకి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం పళనిస్వామి పీఏగా పనిచేస్తున్న దామోదరన్ రెండు రోజుల క్రితమే కొవిడ్-19 లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ బుధవారం దామోదరన్ మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.
ఇక చైన్నైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నెల 19నుంచి 12రోజులపాటు మరోసారి పూర్తి లాక్డౌన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఇప్పటివరకు 48,019పాజిటివ్ కేసులు నమోదుకాగా 528మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1515పాజిటివ్ కేసులు నమోదుకాగా 49మంది మృత్యువాతపడ్డారు.