ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 351 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 275 మంది స్థానికులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో కరొనతో ఇద్దరు మృతి చెందారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 90కి చేరింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 7 వేలకు చేరాయి. ఏపీలో మొత్తం కరోనా కేసులు 7,071 గా నమోదయ్యాయి. దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. డిచిన 24 గంటల్లో 10,974 కేసులు నమోదయ్యాయి.2003 మరణాలు సంభవించాయి. దేశంలో 3 లక్షల 54వేల 65మందికి కరోనా నమోదైంది. దేశంలో మొత్తం 11,903 కి చేరిన మరణాలు సంభవించాయి. 1,55,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,86935 మంది కోలుకున్నారు.