కరోనా వైరస్ సోకి సౌదీలో 11 మంది భారతీయులు మృతి చెందారు. బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్లు.. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని వెల్లడించారు. సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారిన పడగా, మొత్తం 121 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు కోరారు.