ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురంకు చెందిన రామకృష్ణ, సిద్దయ్యలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.