ధర్మవరంలోని ఆర్టీసీ బస్టాండ్, సిద్దయ్య గుట్ట, రేగటి పల్లి రోడ్డు, దుర్గా నగర్ ప్రాంతాలలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాలు అందజేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం, ప్రత్యేక హోదా, తదితర పథకాలను వెనువెంటనే అమలు చేస్తామని వివరించారు.