కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి సహాయనిధికి తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్పై ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు రావాలంటూ ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కోవిడ్-19 సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని గడ్కరీ తెలిపారు.