టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆమె ఏం అన్నారంటే…“పెద్దల సభ సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి కానీ వివాదం సృష్టించే విధంగా ఉండరాదు. పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను పంపించరాదు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే ఆయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు శాసనమండలిలో చైర్మన్ కు ఎదురుగా కూర్చొని చైర్మన్ ను ప్రభావితం చేశారు.
151 మంది ఎమ్మెల్యేలు తీర్మాణం చేసి పంపితే శాసన మండలిలో ఆలస్యం చేయటం సరికాదు. లోకేష్ తీరు చూస్తే బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు ఉంది. కోసి ఉప్పు కారం పూసి కూర వండుకుంటారు. దమ్ముంటే శాసన మండలి రద్దు చేయమని లోకేష్ అనటం అలాగే ఉంది. యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నాడు.” అని రోజా విమర్శించారు.