ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ తో త్వరలో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 04:34 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ నేతలు త్వరలోనే సమావేశం కానున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. రానున్న జనసేనానితో కలిసి పనిచేయనున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేయడానికి బీజేపీ స్థానిక నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఏపీ కోటాలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కేశవరావుకు తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని లక్ష్మణ్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com