ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 08:47 AM

అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. పార్టీ పటిష్టత కోసం అన్ని జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబరు 13 నుంచి 15 వరకూ జిల్లాలో పర్యటించాల్సి ఉండేది. అయితే ఇసుకపై ఒక రోజు దీక్ష చేపట్టాలని భావించి అప్పట్లో పర్యటన వాయిదా వేసుకున్నారు. చివరికి ఆయన జిల్లా పర్యటనను పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఖరారు చేసింది. ఈనెల 18న జిల్లాకు ఆయన రానున్నారు. 20వ తేదీ వరకూ.. అంటే మూడు రోజుల పాటు జిల్లాలో ఆయన మకాం వేయనున్నారు. జిల్లా నేతలు, పార్టమెంటు స్థాయి, అసెంబ్లీ స్థాయి నేతలతో వేర్వేరుగా ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com