ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి సిట్ నోటీసులు అందాయి. ఇప్పటికే, రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరుకాలేదు. దీంతో మూడోసారి ఆయనకు నోటీసులు అందాయి. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కాగా, కడప జిల్లా దేవగుడిలోని ఆదినారాయణరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆదినారాయణరెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది.