ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డికి మళ్లీ నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 08:43 AM

ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి సిట్ నోటీసులు అందాయి. ఇప్పటికే, రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరుకాలేదు. దీంతో మూడోసారి ఆయనకు నోటీసులు అందాయి. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కాగా, కడప జిల్లా దేవగుడిలోని ఆదినారాయణరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆదినారాయణరెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com