ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఉన్న స్ధానిక విహాన్ స్వచ్ఛంద సంస్ధకు చెందిన సుమారుగా 50 మంది HIV బాధితులకు ఈ రోజు మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా జేసే పౌష్టికాహారం DM&HO కార్యాలయంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేమున్నాం వ్యవస్థాపక అధ్యక్షులు కంది.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రతీ నెల మా సంస్ధ ద్వారా HIV బాధితులకు పౌష్టికాహారం (వేరుచనగ పలుకులు, కొమ్ము చనగలు, బెల్లం,సోడిపిండి,పెసలు ) అందిస్తున్నామని, ఇతర స్వచ్ఛంద సంస్ధలు, ప్రభుత్వం కూడా పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేసి వారందరికీ మేమున్నామనే మనోధైర్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో డోకి చంద్రశేఖర్ , మురళి, రామ్ మోహన్ , పద్మ , నిఖిల్ , ప్రణీత, వైశాలి పాల్గొన్నారు.