తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి వైసీపీ నేత బి. వై. రామయ్య దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లన్నింటినీ చెబితే లక్ష బహుమతి ఇస్తానని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కర్నూల్ జిల్లా అభివృద్ధిని విస్మరించారని, అసలు చంద్రబాబు కు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు వైసీపీ నేత రామయ్య.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నపుడు ఎలాంటి అభివృద్ధి జారగలేదని తెలిపిన రామయ్య, ప్రతి పక్ష నేతగా కూడా అట్టర్ ప్లాప్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసారు. కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ కూడా చంద్రబాబు ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు. అధికారంలో ఉండగా రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేసి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం చేతకాక విమర్శలకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బుడ్డి రాలేదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానెయ్యాలని హితవు పలికారు.