వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం రాజోలులో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు..తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలం ఏనుగుపల్లివారిపేటకు చెందిన పారుపూడి పార్వతీ దేవి (35) కి ఒక పాప ఉంది. పార్వతీదేవి బయట ఇళ్ళల్లో పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. (నిన్న) గురువారం సాయంత్రం ఇళ్లలో పనికి వెళ్లిన పార్వతి శుక్రవారం ఇంటి సమీపంలోని పాడుబడిన పాకలో అర్ధనగంగా శవమై ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రాజోలు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ విషయం తెలుసుకున్న రాజోలు సిఐ కె.నాగమోహన్ రెడ్డి, ఎస్ఐ లు ఎస్.శంకర్, డి.శశాంక లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మఅతదేహం ఆర్థనగంగా ఉండటంతో ఎవరైన దుండగులు ఆత్యచారానికి పాల్పడి హత్య చేశారా..? అనే పలు అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. మఅతురాలి భర్త రామలక్ష్మణ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మఅతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.