ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన విషయం తెలిసిందే. గాలి కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణశాఖ అధికారుల సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజుల్లో కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరగనుందన్నారు. ఒకవేళ గాలి నాణ్యత పెరగకపోతే ఇప్పటికే అమలు చేస్తున్న వాహనాల సరి-బేసి విధానాన్ని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. కాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు మరో మూడు రోజులు సరి-బేసి విధానాన్ని పొడిగించనున్నట్లు పేర్కొన్నారు.