ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఎన్టీపీసీ పోస్టుల షెడ్యూలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 06:22 PM

రైల్వేల్లో ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి సంబంధించి 'స్టేజ్-1' పరీక్షల షెడ్యూలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో విడుదల చేయనుంది. ఈ నెలాఖరు కల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో షెడ్యూలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో ఎన్టీపీసీ స్టేజ్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే గతనెలలో ఎన్టీపీసీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి.. అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఎన్టీపీసీ స్టేజ్-1 పరీక్షకు సంబంధించి కదలిక వచ్చింది. ఈ నెలాఖరునాటికి పూర్తి షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో పరీక్ష షెడ్యూలును అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ షెడ్యూలు ప్రకటిస్తే.. పరీక్షకు 10 రోజుల ముందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటిగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి 7 నెలల కావస్తున్న పరీక్షలకు సంబంధించిన వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ ఇంతవరకు ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అప్లికేషన్ స్టేటస్..?


పరీక్ష తేదీల వెల్లడి కంటే ముందుగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎన్టీపీసీ 'అప్లికేషన్ స్టేటస్'ను అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.


ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం...


➥ మొత్తం 100 మార్కులకు 'స్టేజ్-1' ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.


➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.


➥ మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి 'స్టేజ్-2' రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.


➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.


➥ రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com