ఇటీవల నాటు సారా విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్న మండపేట రూరల్ ఎస్.ఐ పి.దొరరాజు మరో విక్రేతను పట్టుకుని అతని నుండి నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. రాధేయపాలెం గ్రామనికి చెందిన వనుం వెంకట రమణ ద్వారపూడి శివార్లలో నాటు సారా విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుండి 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్ట్ కు తరలించినట్లు ఎస్.ఐ చెప్పారు.