గాజువాక: తనకు ఓట్లు ప్రాధాన్యత కాదని.. పోరాటమే తనకు తెలుసన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా గాజువాకలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ గాజువాకలో పోటీ ఓటమిలా తనకు అనిపించడం లేదని, పోరాటయాత్రకు వచ్చిన యువత మొత్తం ఓట్లేసి ఉంటే మనకు 70 సీట్లు వచ్చేవన్నారు. మార్పు మాత్రమే మన లక్ష్యమని.. సామాన్యుని గొంతు వినిపిద్దామన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడితే జనసేన వెనకడుగు వేయదన్న పవన్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నారు. బాహాబాహీ తేల్చుకుందామంటే మేము రెడీ అని.. ప్రతి ఎమ్మెల్యే చిట్టాను బయటకు తీయాలన్నారు.