అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన దృష్టికి తీసుకురాకుండా పురస్కారాల పేరు మార్చడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆదేశించారు. యథాతథంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు గాంధీ, అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.