రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్లతో పవన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త ఇసుక విధానం వస్తుందంటే మొదట సంతోషించామన్నారు. ఇసుక సమస్యను వైసీపీ ప్రభుత్వం మరింత జఠిలం చేసిందన్నారు. నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక అందక కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక కొరతతో 30లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై పడిందన్నారు.