బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ..గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాం. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించారు. సాయంత్రం 6 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారానికి ముందు యడ్యూరప్ప హనుమాన్ దేవాలయంలో పూజలు చేయనున్నారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.