ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట తడబడిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2019, 08:09 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట తడబడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సొంత జిల్లా విజయనగరంకు వచ్చిన పుష్పశ్రీ వాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడబడ్డారు. "మా ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అంటూ పుష్పశ్రీవాణి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె పక్కనే ఉన్న నేతలు అలెర్ట్ చేయడంతో తప్పు తెలుసుకున్న పుష్పశ్రీ వాణి మాటమార్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ పుష్పశ్రీ మాటలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పుష్పశ్రీ వాణిని సీఎం జగన్ ఉప ముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. పుష్పశ్రీ వాణి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com