ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట తడబడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సొంత జిల్లా విజయనగరంకు వచ్చిన పుష్పశ్రీ వాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడబడ్డారు. "మా ముఖ్యమంత్రి ఒకటే లైన్తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అంటూ పుష్పశ్రీవాణి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె పక్కనే ఉన్న నేతలు అలెర్ట్ చేయడంతో తప్పు తెలుసుకున్న పుష్పశ్రీ వాణి మాటమార్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్గా మారింది. నెటిజన్లు ఈ పుష్పశ్రీ మాటలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పుష్పశ్రీ వాణిని సీఎం జగన్ ఉప ముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. పుష్పశ్రీ వాణి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.