గ్రామ స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉండాలని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… గతంలో ఓడిన సమయంలో కారణాలు తెలిసేవని, ప్రస్తుతం ఓటమికి గల కారణాలు తెలియడం లేదన్నారు. ఓటమిపై సమీక్ష చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిన మూడు వారాల్లో 100 చోట్ల దాడులు జరిగాయన్నారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులు, శిలాఫలకాలపై దాడులు జరిగాయన్నారు. టీడీపీ 5సార్లు గెలిచినా ఇలా ఎప్పుడూ దాడులు చేయలేదన్నారు.