ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎండబ్ల్యూ కారులో తిరుగుతూ కోళ్ల దొంగతనం

international |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 05:11 PM

చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు ఏకంగా రెండు కోట్లు పెట్టి బీఎండబ్ల్యూ కారు కొనేశాడు. కానీ, రోజు అదే కారులో తిరుగుతూ కోళ్లు, బాతులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అంత ఖరీదైన కారు కొని ఇదేం పని అనుకుంటున్నారా? బడాయికి పోయి కొన్నాడు కానీ దానికి పెట్రోల్ పోయడానికి అతడి దగ్గర డబ్బులు లేవు. దీంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు.  ఆ రైతు లినుషీ ప్రాంతంలో కోళ్లు, బాతులను దొంగిలించేవాడు. వాటిని మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో బీఎండబ్ల్యూలో పెట్రోల్ కొట్టించుకుని తిరిగేవాడు. సీసీటీవీ కెమేరాల ఆధారంగా నిందితుడిని గుర్తుపెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. మే 22న కోళ్లను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన అతడిని పోలీసులు వెంబడించారు. ఈ సందర్భంగా సినిమా ఫక్కీలో చిన్న సైజు ఛేజింగ్ కూడా జరిగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ రైతుని పట్టుకున్నారు. పెట్రోల్ కోసమే దొంగతనాలను చేసేవాడినని ఆ రైతు ఒప్పుకున్నాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com