ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు నేపథ్యంలో కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేసినట్టు జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. తన పదవీ కాలంలో ఆయా వర్గాలకు సేవ చేసే అవకాశం దక్కిందని జూపూడి ఆ లేఖలో పేర్కొన్నారు.