ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈరోజు కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు, జేడీఎస్ నేత నిఖిల్ గౌడ కలుసుకున్నారు. ఈరోజు అమరావతిలోని జగన్ నివాసానికి వచ్చిన నిఖిల్, జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారన్న విషయమై తెలియరాలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య లోక్ సభ స్థానం నుంచి నిఖిల్ గౌడ పోటీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో 98,000 పైచిలుకు ఓట్ల తేడాతో నిఖిల్ ఓటమి పాలయ్యారు.