ఈవీఎంల లోపాలు, దౌర్జన్యాలతో వైసీపీ చేసిన కుట్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ వైసీపీ వ్యవహరించిన తీరుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పచ్చని డెల్టా ప్రాంతంలోనూ వైషమ్యాలు రెచ్చగొట్టారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి ఈసీ సహకరించిందని ఆరోపించారు.