చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డు 34వ మలుపు వద్ద బైక్ను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని బలరాంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.