ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దేశంలో ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన పాల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగినట్లే మిగతా చోట్ల ఎన్నికలు జరుగుతాయని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని పాల్ అన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని, రానున్న 6 విడతల ఎన్నికలను బహిష్కరించాలని పాల్ పిలుపునిచ్చారు. దేశ కోసం, ప్రజాస్వామ పరిరక్షణ కోసం, దేశాన్ని ప్రేమించే వాళ్లు, రాజకీయ పార్టీలు, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఏకం కావాలని పాల్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఎన్నికలు బాయ్ కాట్ చేస్తే బీజేపీ ఆటలు సాగవు అన్నారు. ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు అనుగుణంగా, మోడీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తున్నాయని పాల్ ఆరోపించారు.