విజయవాడ: టెక్నాలజీతో ముందున్న జపాన్ వంటి దేశాల్లోనూ ఈవీఎంలు నిషేధించారని ఎమ్మెల్సీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యనమల మీడియా సమావేశంలో మాట్లాడారు. మేము పోరాటం చేయడం వల్లే వీవీప్యాట్లు తీసుకొచ్చారన్నారు. అనేక దేశాల్లో ఈవీఎంలు అమలు చేసి తర్వాత వెనక్కి తగ్గాయన్నారు.