జమ్మూ కాశ్మీర్ స్థావరంకు పోతున్న జవాన్ల వాహనాలపై ఉగ్రవాదుల దాడులలో అమరులైన జవాన్ల ఆత్మ శాంతి కోరకు సోమల ఎస్ఐ శ్రీనివాసులు ఆద్వర్యంలో పోలీస్ సిబ్బంది సోమల బస్టాండ్ కూడలీలో కోవ్వత్తుల ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బారతదేశ సరిహద్దులలో తమ కుటుంబాలను సైతం వదిలి దేశ ప్రజల క్షేమం కోసం రక్షణ కవచంగా ఉంటూ ప్రాణాలను వదిలిన సిఆర్ఫిఎఫ్ జవాన్ల కుటుంబానికి ఈ దేశ పౌరులు అండగా వుండాలని కోరారు.వారి ఆత్మకు శాంతి కలగాలని దేశం కోసం అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు ఈ దేశం ఎప్పుడూ అండగా వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది జయశంకర్ రెడ్డి,సునీల్,హనీఫ్,రమణయ్య,నరేష్,చాంద్ బాషా,అనీస్,నాగరాజ,రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.