ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 02:52 PM

విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దిబ్బలవలస వద్ద విమానాశ్రయం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. జిల్లాలో మరో 6 అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. కొత్తవలసలో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసే పతంజలి ఫుడ్‌, హెర్బల్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. గజపతినగరంలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేసే చందన ఫుడ్‌ యూనిట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే ఎల్‌.కోటలో నిర్మించే ఆరోగ్య మిల్లెట్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. విజయనగరంలో వైద్యకళాశాల, డిగ్రీ కళాశాల, గురజాడ వర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com