హైదరాబాద్: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎంపీ అవంతి శ్రీనివాస్తో వైసీపీ నేత విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం అవంతి శ్రీనివాస్ విజయసాయిరెడ్డితో కలిసి మధ్యాహ్నం జగన్ను కలవనున్నారు. కాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖలోని భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. భీమిలి అసెంబ్లి సీటు ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు సమాచారం.