తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. ముమ్మిడివరం మండలం బలుసుల్లంక గ్రామంలో ఉదయం తోటల్లోకి వెళ్లిన ఇద్దరిపై దాడి చేసి గాయపరిచింది. అనంతరం అరటి తోటలోకి వెళ్ళిపోయింది. చిరుత సమీపంలోనే సంచరింస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా రైతులు చిరుత దాడి చేస్తుందేమనని భయపడుతున్నారు.
ఈనెల 4న ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో పంట పొలాల మధ్య పులి ప్రత్యక్షమై నలుగురిపై దాడి చేసి కొబ్బరి చెట్టు ఎక్కింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించగా.. వారి ట్రాప్ నుంచి పరారైంది. తొమ్మిది రోజుల తర్వాత ముమ్ముడివరం మండలంలో మళ్లీ ప్రత్యక్షం అయి కలకలం సృష్టించింది.